శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధికారికి మధుసూదనాచారి సన్మానం.

Sep 15, 2024 - 22:47
 0  4
శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధికారికి మధుసూదనాచారి సన్మానం.

 జోగులాంబ గద్వాల 15 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.

మల్దకల్. సెప్టెంబర్15 :శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  ఆలయ ప్రధాన అర్చకులుగా  పనిచేస్తున్న మధుసూదనాచారిని జోగులంబ గద్వాల్ జిల్లాకు మఠాధికారిగా  నియమితులయ్యారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పరిధిలోని గద్వాల రీజియన్ మల్దకల్, ఐజ, గద్వాల, ధరూర్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంకు సంబంధించి మఠాధికారిగా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు మధుసూదనాచారిని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ కరకమలాలతో నియామక పత్రం అందజేశారు.ఆదివారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మల్దకల్ మండల దేవాలయం వ్యవస్థాపక వంశీయులు పట్వారి ప్రహ్లాద రావు మఠాధికారి మధుసూదనాచారికి శాలువా పూలమాలతోసత్కరించారు. ఈ కార్యక్రమంలో ధీరేంద్రదాస్,అరవిందరావు,బాబురావు,చంద్రశేఖర రావు,వెంకుబ్ రావు,చంద్రశేఖర్ రెడ్డి,పద్మా రెడ్డి,వీరారెడ్డి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333