వెల్దేవి గ్రామంలో అలుగు పోస్తున్న రోడ్డౌన్ పరిశీలించిన ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 18 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో ఆదివారం రోజు రాత్రి కురిసిన వర్షానికి వెల్దేవి అజీంపేట గ్రామ ల మధ్యలో ఉన్న రోడ్డౌన్ ఎస్ఐ వెంకట్ రెడ్డి,పరిశీలించారు.నీరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అటుగా వెళ్లే వాహనదారులు వెళ్లకూడదని హెచ్చరికలు జారి చేశారు.గత కొన్ని రోజుల క్రితం నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు ఏరులై పారుతున్న నేపథ్యంలో రాత్రి వేళలో వాగు నుండి దాటే ప్రయత్నం వాహనదారులు కానీ ప్రయాణాలు చేయరాదని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ మల్లేశం,ఎస్సై వెంకట్ రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.