వరద బాధితులకు 50 వేల రూపాయలు చెక్కును సీఎం రేవంత్ కు అందించిన  కుమారి ఆంటీ

Sep 18, 2024 - 19:42
 0  5
వరద బాధితులకు 50 వేల రూపాయలు చెక్కును సీఎం రేవంత్ కు అందించిన  కుమారి ఆంటీ

ఈ సాయంతో.. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ..మరో మెట్టు ఎక్కేసిన కుమారి ఆంటీ

హైదరాబాద్:సెప్టెంబర్ 18:- తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వరద బాధితు లను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందు కొచ్చింది.. 

కుమారి ఆంటీ అంటే తెలియని వాళ్లుండరు. ఆమధ్య.. సోషల్ మీడి యాలో సునామీ సృష్టించి.. ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించిన కుమారి ఆంటీ.. ఈమధ్య కొంచెం సైలెంట్ అయ్యింది. 

అయితే.. ఇప్పుడు తన గొప్ప మనుసు చాటుకుని.. మరోసారి తెరపైకి వచ్చింది. హయ్ నాన్న.. మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. అంటూ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఆప్యాయం గా పలకరించిన కుమారి ఆంటీ.. ఇప్పుడు తన పెద్ద మనుసు చాటుకుంది. 

వరద బాధితులకు తన తాహతకు తగ్గట్టుగా.. కుమారి ఆంటీ ముఖ్య మంత్రి సహాయనిధికి రూ.50 వేలు విరాళం అందజేసింది. తన కుమార్తె తో కలిసి స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి.. ఆయనకే రూ.50 వేల చెక్కును అందజేసింది కుమారి ఆంటీ. 

తాను చేసుకునే చిన్న వ్యాపారంతో.. కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచి వరద బాధితులకు సాయం అందించి.. కుమారి ఆంటీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని అంటున్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333