బిఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పిన ప్రజలు

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి

Jul 23, 2024 - 10:54
Jul 23, 2024 - 11:36
 0  38
బిఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పిన ప్రజలు
బిఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పిన ప్రజలు

సూర్యాపేట 23 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాకుండా ప్రజలే తగిన బుద్ధి చెప్పారని మాజీమంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మార్నింగ్ వాకులో భాగంగా వారు మాట్లాడుతూ నేను మూడు పర్యాయాలు ఓడిపోయిన గాని ప్రజల మధ్యనే ప్రజల పరిష్కారం కోసమే నేను పని చేస్తున్నానని ఇన్ని సంవత్సరాలు గెలిచిన జగదీష్ రెడ్డి ఇంతవరకు ప్రజలకు ఏం చేశావని అన్నారు. సూర్యాపేటలో నీ కార్యకర్తలే నీ నాయకులే భూకబ్జాలకు పాల్పడ్డారన్నారు.

 మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్ లో నీకు సంబంధించిన సూపర్డెంటూ నీ పెట్టి ఎంత పెద్ద అవినీతి చేశావో ప్రజలకు తెలుసు అని అన్నారు. ఈరోజు నేను ఏరియా హాస్పిటల్ పోతే మెడికల్ కాలేజీ ఏరియా హాస్పిటల్ ఎంత అవినీతిమయమైందో అని నువ్వు రాష్ట్రాన్నికి కాకుండా సూర్యాపేట జిల్లాకు ఏం చేశావు చెప్పాలని సూర్యాపేటలో అభివృద్ధి చేసిన అన్నావు కదా ఎక్కడ అభివృద్ధి చేశావు నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని అన్నారు. మీ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ జై జగదీశ్ అన్నని ఒక అధికారి రాజకీయ నాయకుల యొక్క పని చేశారు తప్ప మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎస్పీ , కలెక్టర్ రాజకీయాలకి అతీతంగా పనిచేస్తున్నారని అన్నారు.

 త్వరలోనే మీ అక్రమ పనులన్నీ బయటపెడతామని పార్లమెంట్ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వస్తే నేను రాజీనామా చేస్తానన్నావు కానీ 70 వేల ఓట్ల మెజార్టీ సూర్యాపేట నుంచి వచ్చిందని కానీ నువ్వు ఇంతవరకు రాజీనామా చేయలేదని చెప్పారు. సూర్యాపేటలో ఎటువంటి కాంటాక్ట్ పనులు చేయాలన్న కేవలం ఒక మనిషిని పెట్టుకొని కమిషన్లు వసూలు చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. సూర్యాపేటకు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి నువ్వేం చేసావు కొత్త సబ్ స్టేషన్ ఏమైనా తెచ్చావా, విద్యాశాఖ మంత్రిగా ఉండి నువ్వేమన ఒక పాఠశాలను తీసుకొచ్చావా అని ప్రశ్నించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినంక 30 వేల కోట్ల ఖర్చు చేసినామని అలాగే రైతుల రుణమాఫీ కోసం ఏడు వేల కోట్లు ఖర్చు చేశామని ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందం చూసిన ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రజల కోసమే పనిచేస్తుందని ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్ సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు, రాపర్తి  శ్రీనివాస్, గండూరి రమేష్, చింతమల్ల రమేష్, గోదాల రంగారెడ్డి, అనంతుల యాదగిరి, సిరివెళ్ల శబరి, బైరు దుర్గయ్య, చెంచల శ్రీనివాస్, రావుల రాంబాబు, సాయి నేత, నిఖిల్ నాయుడు, వాసు, సైదులు, కెక్కిరేణి శ్రీనివాస్, రహీం, సతీష్, గుండాగాని నరేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333