ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి లో 52 దరఖాస్తుల స్వీకరణ......జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్.
జోగులాంబ గద్వాల 9 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ప్రజా సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు లతో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 52 దరఖాస్తులు అందాయని కలెక్టర్ పేర్కోన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.