రైతులను పరామర్శించడానికి వెళుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అక్రమ అరెస్టు

జోగులాంబ గద్వాల 9 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల ఇథనాల్ పరిశ్రమ కు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ని గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా బలవంతంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పూనుకుంటున్న యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు .అదే కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి రైతులపై దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి వాళ్ళని జైలపాలు చేశారని విమర్శించారు మంచి పంటలు పండి వ్యవసాయ అనుకూలమైన భూములను అక్రమంగా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు పరిశ్రమ ఏర్పాటు వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్యాల పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు రాజోలి మండలంలో ఇండ్లు కోల్పోయిన ప్రజలకు సంబంధించిన ప్లాట్లను అక్కడే ఇచ్చారని పరిశ్రమ ఏర్పాటు వల్ల వారు కూడా నిరాశ్రయులవుతారని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంతృత్వ వైఖరి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రైతులు ప్రశ్నించినందుకు పరిశ్రమ యాజమాన్యం ప్రైవేటు బోన్సర్లతో దాడులు చేయించిందని మరి యాజమాన్యంపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు మమ్మల్ని అడ్డుకుంటేనే ప్రజలను జీలపాలు చేస్తేనో ఉద్యమాలు ఆగుతాయనుకోవడం ప్రభుత్వ అవివేకం అన్నారు .తక్షణమే ఇతనాల పరిశ్రమ ఏర్పాటు అనుమతులు రద్దుచేసి రైతులపై అక్రమ కేసులను ఎత్తివేసి వారు నిన్ను జైలు నుంచి విడిపించాలని లైలా పక్షంలో రైతులను ప్రజలను కలుపుకొని దీర్ఘకాల పోరడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు అరెస్టు అయిన వారిలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాం నాయక్ జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి జిల్లా కమిటీ సభ్యులు పరంజ్యోతి ఈదన్న అరెస్టు అయిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిని అఖిల పక్ష నాయకులు నాగర్దొడ్డి వెంకటరాములు అతికూర్ రెహమాన్ సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పరామర్శించారు.