పిడుగుపాటుకు రెండు కాడెద్దులు మృతి
జోగులాంబ గద్వాల్ 19 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: మల్దకల్. మండలం మద్దెలబండ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రైతు సౌటిబావి నరసింహులుకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి. వీటి విలువ అందజా లక్షా ఇరవై వేలు ఉండొచ్చని రైతు తెలిపాడు. రైతు కుటుంబానికి జీవనదారమైన రెండు కాడెద్దులు మృతి చెందడంతో లబోదిబో మని బోరున విలపించాడు. అట్టి రైతును విపత్తుల నష్టపరిహారం క్రింద ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరారు.