పశువులను కలేబాకు తరలిస్తున్న వాహనం పట్టివేత

Oct 1, 2024 - 20:26
Oct 1, 2024 - 20:54
 0  3
పశువులను కలేబాకు తరలిస్తున్న వాహనం పట్టివేత
పశువులను కలేబాకు తరలిస్తున్న వాహనం పట్టివేత

మునగాల 01 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మునగాల మండలం బరాఖత్ గూడెంకు చెందిన షేక్ రియాజ్, షేక్ మహమ్మద్ లు ఇద్దరూ కలిసి పశువుల వ్యాపారం నిర్వహిస్తుంటారు. కాగా కోదాడ లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన 2 ఆవులు, 6 ఎద్దులను పండుగలు ఉన్నందున హైదరాబాద్ లోని చంద్రయనగుట్ట కబేళాకు తన యొక్క వాహనం నంబర్ TS 29TA 4895 గల వాహనంలో లోడ్ చేసుకుని మంగళవారం మధ్యాహ్నం తరలిస్తుండగా మునగాలలో యూటర్న్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా అట్టి వాహనాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. అట్టి పశువులకు త్రాగునీరు, గడ్డి, గాలి, వెలుతురు లేకుండా, ఎక్కువ పశువులను ఎక్కించి హింసకు గురి చేసి వాహనంలో పట్టా కప్పి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు‌. ఈ మేరకు డ్రైవర్, ఇద్దరు హెల్పరు మరియు యజమానులపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. పట్టుబడిన పశువులను సురక్షితంగా హైదరాబాద్ జియాగూడ గోశాలకు తరలించినట్లు తెలిపారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State