పట్టేటి బాలస్వామి మరణం చాలా బాధాకరం

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్ కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి

Jan 7, 2025 - 16:21
Jan 7, 2025 - 16:33
 0  11
పట్టేటి బాలస్వామి  మరణం చాలా బాధాకరం
పట్టేటి బాలస్వామి  మరణం చాలా బాధాకరం

సూర్యాపేట జిల్లా రియల్* *ఎస్టేట్ వ్యాపార* *అసోసియేషన్ అధ్యక్షులు* *పంతంగి వీరస్వామి గౌడ్

(సూర్యాపేట టౌన్ జనవరి 7) రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సీనియర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ పట్టేటి బాలస్వామి మరణం అత్యంత బాధాకరమని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన పట్టేటి బాలస్వామి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. యూనియన్ లో క్రియాశీలక పాత్ర పోషించిన పట్టేటీ బాలస్వామి మరణం యూనియన్ కు తీరని లోటు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బిల్డర్స్ కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగం వల్లనే ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందని చెప్పారు. తెలంగాణలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ రోడ్డు ప్రమాదంలో అనారోగ్యంతో, మరణించారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక జీవో తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విమర్శించారు. గతంలో మున్సిపాలిటీ ద్వారా ,మీసేవ కేంద్రాల ద్వారా ఎల్ ఆర్ ఎస్ కోసం ఎకరాకు పదివేల చొప్పున చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో తేవాలని డిమాండ్ చేశారు. (10000) పది వేలు కట్టిన ఎల్ ఆర్ ఎస్ కోసం ఎంతోమంది ప్రజలు ఎదురుచూస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్

 జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి రాపర్తి జానయ్య గిరీశం పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ కార్యదర్శి తండు సైదులు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సూర్యాపేట పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి వెంకన్న కనకయ్య పట్టణ సహా కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ షేర్ సుధాకర్ రెడ్డి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333