టార్గెట్ పాపులేషన్ స్క్రీనింగ్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్

May 28, 2024 - 20:15
May 28, 2024 - 21:15
 0  39
టార్గెట్ పాపులేషన్ స్క్రీనింగ్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్
టార్గెట్ పాపులేషన్ స్క్రీనింగ్ సెంటర్ ను సందర్శించిన జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్

జోగులాంబ గద్వాల 28 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అర్బన్ హెల్త్ సెంటర్ బర్దపేట పరిధిలో ఉన్న గంజిపేట ఎస్సీ కాలనీ ఉదయం టార్గెట్ పాపులేషన్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. క్యాంపు నందు 30 సంవత్సరముల పైబడిన వారందరికీ కూడా ఇంటింటికి వెళ్లి 40 మందికి బీపీ షుగర్ ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్, స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్  సందర్శించి స్క్రీనింగ్ క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరిని క్వాలిటీగా చెక్ చేసి అన్ని వివరాలు అడగాలని ,వచ్చిన పబ్లిక్ అందరికీ టార్గెట్ పాపులేషన్ గురించి మరియు వ్యాధుల గురించి వివరంగా తెలపడం జరిగింది.

ప్రతి ఇంట్లో ఉన్న 30 సంవత్సరాల పైబడిన వారందరూ తప్పక స్క్రీనింగ్ చేయించుకోవాలని  తెలిపారు... ఈ స్క్రీనింగ్ పరీక్షలో ఒక్కొక్క ఆశ పరిధిలో మొదలు పెట్టి ఆఫ్లైన్ రిజిస్టర్ నందు వివరాలు రాసుకొని ఆన్లైన్లో అనంతరం స్క్రీనింగ్ చేయాలని తెలిపారు.

ఇట్టి స్క్రీనింగ్ క్యాంపులకు.. జిల్లా టీం మరియు స్టేట్ టీంలు కూడా సందర్శించనున్నారని తెలిపారు. మరియు ఇంట్లో ఉన్న వారినందరినీ పోర్టల్ నందు అభాలింక్ చేయాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎం జ్యోతి సూపర్వైజర్ అబ్రహం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State