విజయసంకల్ప యాత్రను జయప్రదం చేద్దాం 

బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S. రామచంద్రరెడ్డి  

Feb 21, 2024 - 18:44
Feb 21, 2024 - 19:03
 0  3
విజయసంకల్ప యాత్రను జయప్రదం చేద్దాం 

జోగులాంబ గద్వాల 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విజయ సంకల్పయాత్ర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S. రామచంద్ర రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ.... ఈనెల 25( ఆదివారం) ఉదయం 8 గంటలకు మన జిల్లాలోకు బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని  అన్నారు ఈ యాత్ర ఎర్రబల్లి చౌరస్తా లో రోడ్ షో ,  ఉండవెల్లి లో రోడ్ షో , అల్లంపూర్ జోగులాంబ అమ్మవారు  దర్శనం మరియు వీధి సమావేశం, శాంతినగర్ లో బహిరంగ సభ , అయిజ పాత బస్టాండు లో రోడ్ షో, మల్దకల్ రోడ్ షో, గద్వాల్   పాత బస్టాండ్లో బహిరంగ సభ ఉంటుంది అని అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్స్,  రామాంజనేయులు,  మెడికల్ తిరుమల్ రెడ్డి,  జిల్లా కోశాధికారి త్యాగరాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు దేవదాసు,  బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి,  గద్వాల పట్టణ అధ్యక్షులు బండ వెంకట రాములు,  మల్లకల్ మండల అధ్యక్షులు పాలయి రాముడు,  అయిజ పట్టణం అధ్యక్షులు నరసింహయ్య శెట్టి మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆసిఫ్,  గట్టు మధుసూదన్ రావు, అనీల్, వీరేష్ రెడ్డి   బాలేశ్వర్ రెడ్డి, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333