జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన బోలోరో వాహనం.

సూర్యాపేట జిల్లా : టేకుమట్ల ఖమ్మం జాతీయ రహదారి, చివ్వెంల మండల పరిధిలోని ఎల్ ఎన్ రావు తండా సమీపంలో బొలెరో వాహనం హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తూన్న క్రమంలో టైర్ పంచర్ అవ్వడంతో రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ఈ వాహనంలో నారాయణ కళాశాల సంబంధించిన ప్రింటింగ్ బుక్స్ లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అవ్వగా, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అతన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.