ఘనంగా కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి 101వ జయంతి వేడుకలు
తిరుమలగిరి 16 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి 101 జయంతి తిరుమలగిరి మండల కేంద్రంలోని పూలే అధ్యయన వేదిక చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్నారు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తన జీవితాంతం జీవిత ఆశయమే పోచంపాడు ప్రాజెక్టు తేవడం అనే ఉద్దేశంతో పోరాడిన వ్యక్తి కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పేదలంతా బాంచన్ దొర కాల్ మొక్కుతా రోజుల నుంచి పేదలకు విముక్తి కల్పించి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనమైన కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ది చరిత్ర అన్నారు ఎర్రబాడు విసునూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి అన్నారు అతని ఆశయాలు సాధించాలంటే నేటి యువత ఆదర్శంగా తీసుకునే పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు కామ్రేడ్ భీమ్ రెడ్డి నరసింహారెడ్డి అడుగుజాడల్లో పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంబాబు ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరు సోమన్న నన్నుబాల మల్లయ్య లక్ష్మయ్య బిక్షం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు