ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట మండి బిర్యాని పోటీలలో నెగ్గిన* కోదాడవాసి గాదరి మధు

Sep 21, 2024 - 13:47
Sep 21, 2024 - 14:11
 0  236
ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట మండి బిర్యాని పోటీలలో నెగ్గిన* కోదాడవాసి గాదరి మధు

ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట మండి బిర్యాని పోటీలలో నెగ్గిన కోదాడవాసి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో అస్రార్ మండి రెస్టారెంట్ వారు నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మండి బిర్యాని పోటీలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగామొత్తం 30 మంది పాల్గొనగా ఇట్టి పోటీలో చివరి వరకు సూర్యాపేట ,కోదాడ మధ్యలో ఉత్కంఠ ంగా కొనసాగుతూ చివరికి 12 నిమిషాల లో మండి బిర్యాని నీ కొల్లగొట్టిన బాహుబలి కోదాడ పట్టణం సాలర్జింగాపేట కు చెందిన జర్నలిస్ట్ గాదరి మధు విజయత గా 5000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు కండలు తిరిగిన జిమ్ బాడీస్ నీ సైతం అవ్వాక్ అనిపించేలా తన జీర్ణ వ్యవస్థ సత్తా ఏంటో జిల్లా వ్యాప్తంగా పోటిలో నెగ్గి అందరి తో శభాష్ అనిపించుకున్న మదుని శాలువాతో సత్కరించి నగదు అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తన చిన్న తనం నుండి తిండి కలవాడొయో కండ కలడు అనే పద్యంలో సూక్తితో బలమైన ఆహారం తింటూ బోజన ప్రియునిగా మారిన అని అప్పటి నుండి సమయస్ఫూర్తి నీ పాటిస్తూ ఆహారం కొన్ని నిమిషాల్లో భుజించే పద్ధతిని అలవాటు చేసుకోవడం వల్ల నేను విజయతగా నివడం జరిగిందని ఇంతటి ప్రోత్సాహాన్ని అందించిన మండే రెస్టారెంట్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. మునుముందు రాష్ట్రస్థాయి జాతి స్థాయిలో కూడా అదృష్టవశాత్తు పాల్గొనే అవకాశం ఉంటే పోటీలకు సిద్ధమని వారు తెలిపారు.ఒక మండిని కేవలం 12 నిమిషాలలో తినడం జరిగింది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State