ఉన్నత స్థాయికి ఎదగాలి శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్

May 11, 2025 - 20:31
 0  24
ఉన్నత స్థాయికి ఎదగాలి   శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఉన్నత స్థాయికి ఎదగాలి శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్  పాత్రికేయులు సమాజానికి ఉపయోగపడే మంచి వార్త కథనాలు రాస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ స్పోకింగ్ పర్సన్, డాక్టర్ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూర్ (ఎస్)మండలం నెమ్మికల్ లో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం( టీజేఎస్) రెండు రాష్ట్రాల స్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు పొందిన సూర్యాపేట ఆంధ్రప్రభ కలెక్టరేట్ రిపోర్టర్ పల్లా పరమేష్ ను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామీణ నేపథ్యం నుండి ఎదిగి జిల్లాస్థాయి వార్త కథనాలు రాసి రెండు రాష్ట్రాల స్థాయిలో ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక కావడం అభినంద నీయమన్నారు. అనంతరం పరమేష్ ను శాలువ, పూల బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి సతీమణి నాగమణి, మనం ఫౌండేషన్ అధ్యక్షులు గంపల నారాయణ, ఆత్మకూర్ (ఎస్) జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత భూపతి రాములు గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జానకి రెడ్డి, మనం ఫౌండేషన్ నిర్వాహకులు గంపల కృపాకర్, మండల కాంగ్రెస్ నాయకులు గంగరబోయిన శ్రీనివాస్, పాత్రికేయులు జలగం మల్లేష్ గౌడ్, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, నెమ్మికల్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.