ఆషాడ మాస మహిళా గోరింటాకు పండగ 

Jul 26, 2024 - 21:44
Jul 26, 2024 - 21:57
 0  9
ఆషాడ మాస మహిళా గోరింటాకు పండగ 

పెబ్బేరు, 26 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పెబ్బేరు మున్సిపాలిటీలో  ఆషాడ మాసం సందర్బంగా  పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఆర్య వైశ్య మహిళలు గోరింటాకు పండగ ను ఘనంగా జరుపుకొన్నారు. అదేవిధంగా ఆలయ అర్చకులు అమ్మవారి ని ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళలు కవిత, రాధికా, నిర్మల, భార్గవి, గీత, సుమలత, లత, శ్రీలత, రమాదేవి, లక్ష్మి, సంధ్య, భాగ్యలక్ష్మి, అరుంధతి, అనిత తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333