అలంపూర్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.

Mar 6, 2024 - 19:12
Mar 7, 2024 - 01:36
 0  15
అలంపూర్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.

జోగులాంబ గద్వాల 6 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఉండవెల్లి. నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగింపు కొరకు తేదీ 07.03.2024 గురువారం నాడు మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు 33KV శాంతినగర్-2 ఫీడర్ లో లైన్లకు తాకే చెట్ల కొమ్మలు తొలగించే కార్యక్రమం తో పాటు ఇటిక్యాల మండలం, 33/11KV చాగపూర్ సబ్ -స్టేషన్ పరిధిలోని 11KV చాగపూర్ ఫీడరు లో విద్యుత్ లైన్ మరమ్మత్తు పనులు చేపట్టుతున్నందున చాగపూర్, వల్లూరు, బట్లదిన్నె గ్రామాలకు మరియు అలంపూర్ సబ్ -డివిజన్ యొక్క శాంతినగర్ సెక్షన్ మరియు మానోపాడ్ సెక్షన్ల పరిధిలోని వివిధ 33/11KV సబ్ -స్టేషన్ లైన శాంతినగర్, రాజోలి, మానోపాడ్ మరియు కలుకుంట్ల (శ్రీనగర్) విద్యుత్ సబ్ -స్టేషన్లలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేయటం జరుగుతుంది. కావున పైన తెల్పిన ఆయా సబ్ -స్టేషన్ ల పరిధిలో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. కావున  విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించగలని.విద్యుత్ శాఖ, అలంపూర్ సబ్ -డివిజన్, కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State