అడ్డగూడూరు తాసిల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల తీన్మార్ మల్లన్న కరపత్రం పంపిణీ

May 25, 2024 - 20:57
May 26, 2024 - 00:34
 0  10
అడ్డగూడూరు తాసిల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల తీన్మార్ మల్లన్న కరపత్రం పంపిణీ

అడ్డగూడూరు 25 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు మందుల సామేల్ ఆదేశానుసారం అడ్డగూడురు మండలంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలసి తీన్మార్ మల్లన్న టీిమ్ సుడిగాలి పర్యటన చేశారు. అడ్డగూడూరు మండల పరిధిలోని,ధర్మారం,రేపాక,అజింపేట,కొండంపేట,కాంచనపల్లి,బొడ్డుగూడెం గ్రామాలలో తీన్మార్ మల్లన్న టీం కో-ఆర్డినేటర్ తుంగతుర్తి రవి పట్టభద్రులతో ముఖాముఖి అడ్డగూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో తీన్మార్ మల్లన్న  గెలుపు కోసం తీన్మార్ మల్లన్న టీం కో-ఆర్డినేటర్ తుంగతుర్తి రవి విసృత పర్యటన చేశారు.ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ..తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది.10 ఏండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచక పాలనలో ప్రజల పక్షాన నిలబడి కొట్లడిన మల్లన్నకు పట్టభద్రులు అండగా ఉండాలని కోరారు.ఆయనతో పాటు అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోలెబోయిన లింగయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బాలెంల సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోలి రాంరెడ్డి, బొడ యాదగిరి,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మచ్చాస్ రెడ్డి, కొమ్ము నాగరాజు,బి సైదులు, చిప్పలపెల్లి పరుశారములు, చెరుకు వెంకన్న, బాలెంల మహేందర్ అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల పవన్ మందుల సోమన్న, బాలెంల మధుకర్, వారితో పాటు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.