36 లక్షల రైతుబంధు నిధులను పక్కదారి పట్టించిన ఏఈఓ

Feb 24, 2024 - 19:01
 0  2

AEO ని సస్పెండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు

జోగులాంబ గద్వాల 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గట్టు. మండలం బలిగెర గ్రామ వ్యవసాయ విస్తీరణ అధికారి దివ్య 64 మంది అర్హులైన రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ పంపకుండా బినామీ బ్యాంక్ ఖాతాలు పంపి 36 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ రైతు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా రికార్డుల్లో పాస్ బుక్ నెంబర్లు సరిగా ఉన్న నగదు ఇతరులకు పడుతున్నట్లు గుర్తించి బాధ్యురాలైన AEO దివ్య ను స్పెండ్ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి  తెలంగాణ వార్త నుంచి చరవాణి ద్వారా వివరణ కోరగా ఆమెను సస్పెండ్ చేయడం వాస్తవమేనని ఆయన తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333