10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందించిన జిల్లా ఎస్పీ

Jun 7, 2025 - 21:26
 0  212
10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందించిన జిల్లా ఎస్పీ

తిరుమలగిరి 08 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నందు పని చేస్తూ అకాలంగ మరణించిన హెడ్ కానిస్టేబుల్ రమేష్ కుటుంభానికి 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్ ను ఈరోజు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్  తన కార్యాలయం నందు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పోలీసు లకు ప్రత్యేక సాలరీ ప్యాకేజీ ఇవ్వడం జరిగినది. పోలీసు సిబ్బంది సాధారణ మరణం సంభవిస్తే ఈ పోలీస్ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ అందిస్తుంది. ఈ స్కీం ద్వారా ఈరోజు రమేష్ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేయడం జరిగినది అని, ఈ స్కీం పోలీసు కుటుంబాలకు ఎంతగానో ఆర్థిక బాసట నిలుస్తుంది అని ఎస్పి  అన్నారు. ప్రమాదం వల్ల మరణిస్తే సిబ్బంది కుటుంభానికి 1 కోటి రూపాయల ఇన్యురెన్స్ ఈ ప్యాకేజీ నందు కలదు. సిబ్బంది అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు. ఈ స్కీం ను రూపొందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి అభినందనలు తెలిపినారు.  ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవిందర్ రెడ్డి, AO మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్, మహిళా SI మౌనిక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూర్యాపేట రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, చీఫ్ మేనేజర్ విద్యాసాగర్, చీఫ్ మేనేజర్ మోహన్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034