హుస్సేన్నాగర్లో గణేష్ నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ హుస్సేన్నాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమజ్జనాలు జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పటిషన్ సరికాదని కోర్టు పేర్కొంది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది.