సూర్యాపేటలో టి యు డబ్ల్యూ జే రాష్ట్ర సభలు
సూర్యాపేటలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో టి యు డబ్ల్యూ జే (ఐ జేయు)రాష్ట్ర సభలు
టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు
సూర్యాపేట 12 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధం... H9/2014) రాష్ట్ర సభలు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో సూర్యాపేటలో నిర్వహిస్తున్నట్లు టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు, డాక్టర్ బంటు కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మిక్కిలినేని శ్రీనివాసరావు లు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు.
తమ యూనియన్ ఏర్పడిన 67 సంవత్సరాలుగా జర్నలిస్టుల పక్షాన అనేక సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ జర్నలిస్టుల హక్కులు, బాధ్యతలు కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేటలో గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లను ఆహ్వానించి రాష్ట్ర మహాసభలను సూర్యాపేటలో జరిపిన ఘనత తమ యూనియన్ కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలో తొలిసారిగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ సౌకర్యం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనమైన పోరాట చరిత్ర ఐజేయు ది
అన్నారు. మూడవసారి కూడా రాష్ట్ర యూనియన్ సభలను సూర్యాపేటలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈసారి కూడా రాష్ట్ర సభలను విజయవంతం చేయడానికి సహకారం అందించాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బత్తుల మల్లికార్జున్, రెబ్బా విజయకుమార్, సిరికొండ సైదులు, కోశాధికారి తల్లాడ చందన్, ముషం హరి, దిశ ఉట్కూరి రవీందర్, ఫణి నాయుడు, వార్త శ్యాం కుమార్, దేవరశెట్టి వేణుమాధవ్, హెచ్ఎంటీవీ నాగరాజుగౌడ్, ఏబీఎన్ మల్లేష్ గౌడ్, గుడి పూరి రామకృష్ణ గౌడ్, జనార్ధన చారి, మధు, కొండ్లె కృష్ణయ్య, శిరం శెట్టి ఆనంద్, బొల్లెద్దు వెంకటరత్నం, ఉయ్యాల నరసయ్య గౌడ్, పల్లె మణి బాబు, నాగరాజు, రామకృష్ణ, నరేందర్, కొండా శ్రీనివాస్, తండు వెంకటేష్ గౌడ్, ప్రవీణ్, జహీర్, రమేష్, వాసా చంద్రశేఖర్, రామచంద్ర రాజు, కాటం గౌడ్, సుమన్, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.