రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా వ్యవసాయాధికారి పి. శ్రవణ్ కుమార్
తెలంగాణ వార్త మాడుగులపల్లి ఏప్రిల్ 3 : మాడుగులపల్లి మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారిఆకస్మికంగా తనిఖీ చేసి తేమ శాతన్ని పరిశీలించారుఈ సందర్బంగా మాట్లాడుతు ప్రభుత్వం వరి A గ్రేడ్ రకానికి క్వింటాల్ కి రూ 2320/- గాను,సాధారణ రకానికి రూ 2300/- గాను కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని ఆయన తెలియచేసారుఅంతే కాక తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన సన్న ధాన్యానికి ప్రోత్సహకంగా క్వింటాల్ కి రూ 500/- లు బోనస్ ప్రకటించడం జరిగిందని ఆయన తెలియచేసారుకావున రైతులందరు కూడా కనీస మద్దతు ధరను పొందాలంటే తప్పనిసరిగా నాణ్యత ప్రమాణలను పాటించాలని తేమ శాతం 17% ఉండేవిధంగావడ్లలో తాలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలియచేసారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యం.శివరాం కుమార్,వ్యవసాయ విస్తరణ అధికారులు జి. శిరీష, వేణుగోపాల్, పార్వతి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు..