రాయల్ పుడ్ కోర్ట్ కు 5 వేల రూపాయలు పెనాల్టీ...

సూర్యపేట.13 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యపేట పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ శరభమ్మ హోటల్ ప్రాంతంలో గల రాయల్ ఫుడ్ కోర్ట్ పరిసరాల లోపల అపరి పరిశుభ్రంగా ఉన్నందున మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాసు ఆదేశాల మేరకు సానిటరీ అధికారులు,జవాన్లు, సిబ్బంది తనిఖీ చేసి రాయల్ పుడ్ కోర్టు యాజమాని జానీపాషా కు 5వేల రూపాయలు పెనాల్టీ వేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణంలో హోటల్స్ యాజమాన్యాలు,పెట్టి వెండర్స్ వ్యాపారం చేసే వారు ఎవరైనా తమ పరిసరాలను,హోటల్స్ లోపల పరిశుభ్రంగా ఉంచుకోవాలని మురిగి,పులిసి పోయిన,నిల్వ ఉంచిన పదార్ధాలను వాడిన అట్టి హోటల్స్ ను సీజ్ చేయడంతో పాటు భారీ మొత్తంలో పెనాల్టీలు వేయడం జరుగుతుందన్నారు. హోటల్స్ చుట్టూ ప్రక్కల వారికీ ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ లు సారగండ్ల శ్రీనివాస్,బూర సతీష్,హెల్త్ అస్సిటెంట్ మాస్కపురం సురేష్ ,జవాన్లు, ములకలపల్లి పరుశురాములు, పిడమర్తి ప్రసాద్ ,దండు ఉపేందర్ , జి.మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.