రామన్నపేటలో 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం ఉపేందర్

Oct 17, 2024 - 17:37
 0  3
రామన్నపేటలో 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

రామన్నపేట 17 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ పి ఆర్ డి రామన్నపేట మండల కేంద్రములో రాష్ట్ర 4 వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఎన్  పి ఆర్ డి రాష్ట్ర సహాయక  కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..అక్టోబర్ 25-26తేదీల్లో హైదరాబాద్ నగరంలో ఎన్ పీఆర్డీ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు.మహాసభలను ప్రారంభించెందుకు ముఖ్య అతిథిగా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క,టీవీ సిసి చైర్మన్ ముత్తినేని వీరయ్య హాజరు అవుతున్నారని తెలిపారు.ఈమహాసభల్లో వికలాంగులకు బస్సు సౌకర్యం కల్పించాలని వికలాంగులకు ఉపాధి అవకాశాలలో బ్యాంకు ద్వారా ఎలాంటి చర్తులు లేకుండా10. లక్షల రూపాయలు రుణం ఇప్పివ్వాలని వికలాంగులకు అన్ని రకాల పరికరాలు కల్పించాలని నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్స్ అమలు, పెన్షన్ పెంపు, స్వయం ఉపాధి, చట్టాల అమలు,ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు. 
మహాసభల్లో రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.ఈ ప్రారంభ సభకు యాదాద్రి భువన జిల్లా వ్యాప్తంగా మండల గ్రామాల్లో నుండి వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల గౌరవ అధ్యక్షులు  బొడ్డుపల్లి వెంకటేశం మండల  అధ్యక్షులు బలుగూరి  ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి గిరికల లింగస్వామి ఉపాధ్యక్షులు నూతి నరసింహ,పరశురాం, పూన్న శ్రీధర్, పుట్టల ఉదయ్, ఏటెల్లి నిస్సి తేజ, కే వెంకటేశం, చంద్రమౌళి,మోటి బీరప్ప, ఇరమళ్ళ ముత్తయ్య,తదితరులు హాజరయ్యారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333