బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామినీ దర్శించుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జోగులాంబ గద్వాల 27 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం గద్వాల ప్రిన్సిపల్ డిస్టర్బ్ జడ్జి గా కళ్యాణ చక్రవర్తి బాధ్యతలు చేపట్టే ముందు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికి దేవాలయంలో పూజలు అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తదితరులు ఉన్నారు.