Telangana Vaartha Feb 16, 2026 0 9
Telangana Vaartha Feb 2, 2026 0 54
Telangana Vaartha Oct 29, 2025 0 56
Telangana Vaartha Apr 1, 2025 0 55
Telangana Vaartha Feb 28, 2025 0 61
Telangana Vaartha Mar 24, 2026 0 0
Telangana Vaartha Feb 27, 2026 0 12
Telangana Vaartha Mar 6, 2025 0 71
Jujjuri saidulu Jan 26, 2026 0 8
A Sreenu Jan 9, 2026 0 21
RAVELLA Aug 5, 2025 0 98
Jujjuri saidulu Jul 29, 2025 0 54
RAVELLA Jun 14, 2025 0 47
Telangana Vaartha Mar 22, 2026 0 4
Telangana Vaartha Mar 11, 2026 0 15
Telangana Vaartha Mar 10, 2026 0 5
Telangana Vaartha Mar 9, 2026 0 4
Telangana Vaartha Mar 9, 2026 0 9
Jujjuri saidulu Oct 21, 2025 0 32
KADEM RAVIVARMA Oct 14, 2025 0 159
Telangana Vaartha Apr 28, 2025 0 53
Telangana Vaartha Apr 13, 2025 0 61
Telangana Vaartha Apr 8, 2025 0 46
Telangana Vaartha Mar 16, 2026 0 3
RAVELLA Feb 20, 2026 0 29
Telangana Vaartha Feb 12, 2026 0 6
RAVELLA Jan 25, 2026 0 24
RAVELLA Sep 6, 2025 0 51
జేరిపోతుల రాంకుమార్ Mar 24, 2026 0 312
Telangana Vaartha Mar 24, 2026 0 4
Telangana Vaartha Mar 23, 2026 0 31
Alli Prashanth kumar Mar 23, 2026 0 85
Telangana Vaartha Mar 24, 2026 0 2
Telangana Vaartha Mar 23, 2026 0 8
Telangana Vaartha Mar 23, 2026 0 12
Telangana Vaartha Mar 23, 2026 0 1
Join our subscribers list to get the latest news, updates and special offers directly in your inbox
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్. మంగళవారం ఆత్మకూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని ఓపి రిజిస్టర్ను, ఏ ఎన్ సి రీజిస్టర్ లను పరిశీలించారు. ఈ డి డి రిపోర్టు పరిశీలించి ఈ వారంలో జరిగే ప్రసవాలు వివరాలను ఏఎన్ఎం సంద్యను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలకు దగ్గరలో ఉన్న పేషెంట్లను వారి యొక్క డెలివరీ ప్లానింగ్ వివరాలు ఏఎన్ఎమ్స్ దగ్గర ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. రాబోవు వానాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రి నందు మందుల స్టాకు బాక్సులు అడ్డదిడ్డంగా పెట్టడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వీటిని స్టోర్ రూమ్ కి మార్చవలసిందిగా డాక్టర్ మౌనికకు ఆదేశించారు. సాధారణ ప్రసవాలు చేపట్టాలని అలాగే సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం మండలంలోని రైతు వేదికలో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కార కోసం ప్రవేశపెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జూన్ 20 వరకు కొనసాగే రెవెన్యూ సదస్సులో రైతుల పాల్గొని తమ భూ సమస్యలను పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో తమ పరిధిలో లేని అనేక సమస్యలకు ఈ కొత్త చట్టంలో అనేక మార్గాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం రెవెన్యూ సధస్సులు పెట్టి రెవెన్యూ అధికారులనే రైతుల వద్దకు పంపిందని ,ఇక్కడ ఇచ్చే దరఖాస్తులలో పూర్తి వివరాలు రాసి సంతకం పెట్టి దరఖాస్తు ఇచ్చిన వెంటనే రసీదు పొందాలని కలెక్టర్ రైతులకు తెలిపారు. కొత్తచెట్టం ప్రకారం అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, చట్టం గురించి పూర్తిగా అవగాహన పరచడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులందరూ తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం అధికారులు గ్రామాలకు వచ్చి పరిశీలించినప్పుడు ప్రజలందరూ రెవెన్యూ అధికారులకు పూర్తిగా సహకారం అందించాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు తమ వద్ద గల పూర్తి ఆధారాలు కాగితాలను చూపించాలని కలెక్టర్ పేర్కొన్నారు. విచారణ జరుగుతున్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరిగిన పై అధికారులకు అప్పీల్ చేసుకొనుటకు అవకాశం ఉందని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న రెవెన్యూ సదస్సు లో ప్రశాంత వాతావరణంలో దరఖాస్తు చేసుకున్నట్టుగా ఉందని, అధికారులు కూడా జాగ్రత్తగా రైతుల చెప్పే సమస్యలను శ్రద్ధగా విని వారికి పూర్తి సహాయం చేయాలని వారి యొక్క భూముల సమస్య తీరేలా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన రెవెన్యూ సదస్సులో మొత్తం 261 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇక్కడ దరఖాస్తు అందజేసిన రైతు టీ పద్మ యొక్క రసీదును తన కుమారుడికి కలెక్టర్ స్వయంగా చేతుల మీదుగా అందించారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన తంగేళ్ల వెంకటరెడ్డి, అబ్బ గాని బిక్షం తో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను విన్నారు. తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తాసిల్దార్ అమీన్ సింగ్, ఆర్ ఐ ప్రదీప్, జూనియర్ అసిస్టెంట్లు అజయ్, సుధాకర్, ఎం పి ఎస్ శంకర్ పాల్గొన్నారు.
Telangana Vaartha Oct 28, 2024 0 29
RAVELLA Oct 19, 2024 0 24
Telangana Vaartha Feb 28, 2024 0 345
జేరిపోతుల రాంకుమార్ Feb 28, 2026 0 1659
జేరిపోతుల రాంకుమార్ Mar 22, 2026 0 779
జేరిపోతుల రాంకుమార్ Mar 3, 2026 0 669
Telangana Vaartha Mar 13, 2026 0 564
జేరిపోతుల రాంకుమార్ Mar 22, 2026 0 542
Telangana Vaartha Mar 23, 2026 0 3
Telangana Vaartha Mar 23, 2026 0 2