పిర్యాదుల పట్లా వాస్తవాలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలి:-జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

 ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ.

Sep 30, 2024 - 19:18
 0  4
పిర్యాదుల పట్లా వాస్తవాలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలి:-జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల పిర్యాదుల పట్లా వాస్తవాలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా   జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 11 మంది అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. భూ సమస్యలు, ప్లాట్స్ కబ్జా, ఇతర అంశాల పై పిర్యాదులు రావడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన  ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి పిర్యాదులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించేలా పని విధానం ఉండాలన్నారు. అలాగే  చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333