పరీక్షలో ఫెయిలైనందుకు మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత (17) ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామానికి చెందిన పూజ (17) ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలోని అప్పాజీపేటకు చెందిన జాడి సంజన (16) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది