పద్మశ్రీ మందకృష్ణ మాదిగని కలిసిన దళిత బంధు లబ్ధిదారులు,వినతిపత్రం అందజేత
అడ్డగూడూరు 21 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు అడ్డగూడూరు మండలాలకు సంబంధించిన దళిత బంధు లబ్ధిదారులు డా" బుషిపాక గణేష్ ఆధ్వర్యంలో కలిసిన బృందం గురువారం రోజు హైదరాబాద్ లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నివాసంలో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.28/01/2025 న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఎండి 2వ విడత దళిత బంధు నిధులను గ్రౌండింగ్ పూర్తి చేసి లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆర్డినెన్స్ జారీ చేశారు. కొన్ని జిల్లాల కలెక్టర్లు సక్రమంగా ఆర్డినెన్స్ ను అమలు చేశారు. కానీ యాదాద్రి జిల్లా కలెక్టర్ మరియు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు రెండున్నర సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారనీ మందకృష్ణ మాదిగకి వివరించడం జరిగింది.అనంతరం ఆర్డినెన్స్ కాపీలను మంద కృష్ణ మాదిగకి అందించడం జరిగింది. మందకృష్ణ మాదిగ సానుకూలంగా స్పందించి సంబంధిత మంత్రితో ప్రత్యక్షంగా మాట్లాడతానని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 2వ విడత దళిత బంధు నిధులు విడుదల అయ్యేలా చొరవ చూపుతానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాలెంల నరేందర్ జిల్లా శివాజీ,చెడే సైదులు,జక్కులగిరిబాబు,ప్రభు,బుషిపాక సంజీవ ,బండి వెంకటేష్,శ్రీరాములు ప్రదీప్ కొండ్ర ప్రభు,నాగరాజు, నిరంజన్,తదితరులు పాల్గొన్నారు.