తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం:జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు

 ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా ఎస్పీ .

Feb 10, 2025 - 19:12
 0  5
తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం:జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 10 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఎస్పీ కార్యాలయానికి  జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యల పై  వచ్చిన 06 మంది భాదితుల సమస్యలను. డి .ఎస్పి మోగిలయ్యా, ఆలంపూర్, గద్వాల , శాంతి నగర్ సర్కిల్ అధికారుల సమక్షంలో అడిగి తెలుసుకున్నారు. భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులను  ఆదేశించారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో విచారణలో ఏలాంటి జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని అధికారులకు ఎస్పీ  ఆదేశించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333