డి రేపాక గ్రామంలో పిడుగుపాటుకు 13 గొర్రెలు మృతి
అడ్డగూడూరు 17 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామంలో శుక్రవారం రోజు ఉరుములతో కూడిన వర్షం కారణంగా పిడుగుపాటుకు 13 గొర్రెలు మృతి చెందాయి అట్టి విషయం గొర్రెల కాపరి బాధితులు అధికారులకు విషయం తెలపగా వెంటనే స్పందించి అక్కడికి చేరుకున్న పశు వైద్యాధికారి అనిల్ రెడ్డి, ఆర్ ఐ రాజేష్, గొర్రెలను పరీక్షించారు. అనంతరం వాటిని పంచనామా చేసి పై అధికారులకు రిపోర్ట్ లు పంపారు. గొర్రెల కాపరి యజమానులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నుండి నష్టపరిహారాన్ని అందజేస్తామని పశు వైద్యాధికారి అనిల్ రెడ్డి తెలిపారు.