గంజాయి పట్టివేత

జోగులాంబ గద్వాల 13 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని లోని వ్యవసాయ మార్కెటింగ్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న బషీర్ ను తనిఖీ చేయగా 680 గ్రాములు గంజాయి పట్టుబడినట్లు టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు.వివిధ రాష్ట్రలకు ఇతను సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇతని స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా చింతలపేట కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు...