జేఈఈ మెయిన్స్ లో జయ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేట 21 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- జేఈఈ మెయిన్స్ లో జయ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట నుండి 5 విద్యార్థులు 99 పైన పర్సంటేజ్ 26 గురు విద్యార్థులు 90 ఆపైన 74 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. కళాశాలకు చెందిన ఎన్. సాయి రిత్విక్ 99.55, జి శ్రీనిక 99.43, ఎస్ ఆశువర్ధన్ 99.36, ఎం రితిన్ శెట్టి 99.23, సిహెచ్ శివకుమార్ 99.09, ఎస్కే నేహా 98.68, డి సిరి 97.16, ఎండి హాదియా 96.96, జీ వంశీ 96.09, జి హర్షిత 95.92, వి గౌతమ్ కుమార్ 95.71 పర్సంటేజ్ సాధించారని తెలిపారు. ఆల్ ఇండియా అన్ని కేటగిరీ లలో 115, 563, 862, 963 లతో పాటు 5000 లోపు 10 ర్యాంకులు, 10000 లోపు 18 ర్యాంకులు సాధించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కృషిచేసిన అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి లు అభినందించారు.