గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలే శ్రీ రామ రక్షా డాక్టర్"భరత్ కుమార్

అడ్డగూడూరు 17 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదేశాల మేరకు ఎంపిడిఓ శంకరయ్య ఆధ్వర్యంలో అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట గ్రామ పంచాయతీలో భాషబోయిన రమ్య అనే గర్భిణీ స్త్రీ ఇంటికి వెళ్లి,రమ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని,డెలివరీ కొరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోవాలని తెలిపారు.గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఆసుపత్రులు శ్రీ రామ రక్షా అని అన్నారు.వారికున్న అనుమానాలను నివృత్తి చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవడానికి వారిని ఒప్పించడం జరిగింది.తదుపరి తల్లీ బిడ్డ ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్ లతో కూడిన న్యూట్రిషన్ కిట్ ను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్"భరత్ కుమార్ రాథోడ్,పంచాయతీ కార్యదర్శి రమేష్,పి.హెచ్.సి సూపర్వైజర్,ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.