కర్నూల్ లోని కెనరా బ్యాంక్ లో లోన్ తీసుకున్న  రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలిని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి

Jul 24, 2024 - 19:31
 0  37
కర్నూల్ లోని కెనరా బ్యాంక్ లో లోన్ తీసుకున్న  రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలిని

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు .

జోగులాంబ గద్వాల 24 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని వ్యవసాయ రైతులు ఆంధ్రప్రదేశ్  రాష్టం కర్నూల్ లోని కెనరా బ్యాంకులో పంట రుణాలు (లోన్ ) తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించెవిధంగా చూడాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే విజయుడు  వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వాలు తెలంగాణ రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్టం లోని బ్యాంక్ లలో తీసుకున్న పంట రుణాలను(లోన్) మాపీ చేసిన్నట్లు ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పదించిన సీఎం అధికారుల ద్వారా నివేదికలు సేకరించి రైతులకు రుణమాఫీ అయ్యేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333