ఎలాంటి పొరపాట్లు ఉండకుండా చూసుకోవాలి జాయింట్ కలెక్టర్
తిరుమలగిరి 22 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి తహశీల్దార్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్, హరి సింగ్ సూర్యాపేట ఆధ్వర్యంలో బి ఎల్ ఓ ల మీటింగ్ నిర్వహించడం జరిగింది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (SIR) పైన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం డిజిటలైజేషన్ పారదర్శకంగా ఉండాలని కోరారు. ఎలాంటి పొరపాట్లు ఉండకుండా చూసుకోవాలని బి ఎల్ ఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ జి. వినోద్ కుమార్, డి టి జాన్ మొహమ్మద్, సూపర్వైజర్లు కిషన్, అనిత, సుభద్ర మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు