సిపిఎం సీనియర్ నాయకులు కాసాని హనుమయ్య మృతి

Sep 28, 2024 - 14:59
Sep 28, 2024 - 17:02
 0  18
సిపిఎం సీనియర్ నాయకులు కాసాని హనుమయ్య మృతి

సిపిఎం సీనియర్ నాయకులు కాసాని హనుమయ్య మృతి. నడిగూడెం ,సెప్టెంబర్ 28 సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రామాపురం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు, గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు కాసాని హనుమయ్య ( 70) గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై శనివారం మృతి చెందారు. ఆయన పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు కమ్యూనిస్టుగా ఉండి పేద ప్రజల పక్షాన జరిగిన పోరాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రైతు సంఘం సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, ప్రజా సంఘాల నాయకులు ఏనుగుల మోహన్ రావు, పప్పుల వెంకటేశ్వర్లు, మాతంగి వీరయ్య, నేలమర్రి రాములు , మెండే మధు, ఏనుగుల శేషయ్య, వీరబాబు, సైదయ్య ,ఉపేందర్, రామానుజo, భార్గవ్ , వివిధ పార్టీల నాయకులు ,తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State