షీ టీమ్స్, డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన అర్వపల్లి పిఎస్ పరిధి

Sep 28, 2024 - 14:55
Sep 29, 2024 - 07:16
 0  46
షీ టీమ్స్, డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన  అర్వపల్లి పిఎస్ పరిధి

28.09.2024.షీటీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, పై అవగాహనఅర్వపల్లి PS పరిది.

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు SI బాలకృష్ణ గారు, సూర్యాపేట జిల్లా షీ టీం మహిళా SI నీలిమ గారు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల లో షీ టీమ్స్ , సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.* 

SI బాలకృష్ణ గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి అధ్వర్యంలో షీ టీమ్స్, సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో కళాశాలలో, వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,* *ATM* *కార్డ్ వివరాలు,* *OTP* *వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.* *సైబర్ మోసాలపై* *1930* *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే* *వేధింపులపై* *100* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* 

*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు* *యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. *సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన* *పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు* 

 *సూర్యాపేట షీ టీమ్స్ మహిళ SI నీలిమ గారు మాట్లాడుతూ మహిళల రక్షణ పై పటిష్టంగా పనిచేస్తున్నామని, ఆకతాయిలా ఆటలు సాగవని, మహిళలను ఆడపిల్లలను గౌరవించాలని తెలియజేశారు అదేవిధంగా ఆత్మ రక్షణ కొరకు మెలుకువలు నేర్చు కోవాలన్నారు*ఎవరైనా మీ ఆత్మగౌరవాన్ని భంగపరిచినట్లయితే షీ టీం నెంబర్ 8712686056 కు సమాచార తెలియజేయవచ్చు అన్నారు* *టీ సేఫ్ యాప్ గురించి విద్యార్థినిలకు వివరించారు* 

*అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన* *కల్పించారు* .*ఈ కార్యక్రమం నందు కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ శిరీన్, షీ టీం హెడ్ కానిస్టేబుల్ యల్లారెడ్డి కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, నాగర్జున మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State