సమాచార హక్కు రక్షణ చట్టం నడిగూడెం మండల నూతన మండల కమిటీ ఎన్నిక
సమాచార హక్కు రక్షణ చట్టం నడిగూడెం మండల నూతన మండల కమిటీ ఎన్నిక
నడిగూడెం 11 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నడిగూడెం మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం – 2005 ఆధ్వర్యంలో నూతన మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు నెమ్మాది రామారావు, కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించారు. ఎన్నికైన వారిలో మండల అధ్యక్షులుగా గంటెపంగు విజయ్ ఉపాధ్యక్షులుగా నేలమరి మధు వర్కింగ్ ప్రెసిడెంట్గా నెమ్మాది కాంతారావు టౌన్ ప్రెసిడెంట్గా గంటెపంగు నాగరాజు సెక్రటరీగా మాతంగి సురేందర్ జాయింట్ సెక్రటరీగా కే శ్రీను పొలిటికల్ కన్వీనర్గా దున్న దినేష్ కుమార్ యూత్ కన్వీనర్గా దున్న శ్రీకాంత్ మీడియా కన్వీనర్గా గంటెపొంగు సైదులు కోఆర్డినేటర్లుగా దాసరి నాగేశ్వరరావు, లంజపల్లి రవి శిశు రక్షణ కన్వీనర్గా దున్న నాగరాజు విద్యార్థి కన్వీనర్గా నవీన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు నెమ్మాది రామారావు, కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం అంజి, మునగాల మండల అధ్యక్షుడు ఆకారపు వసంత్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.