రూ 2.50 లక్షల విలువైన ఎద్దులు, ఆవుల చోరీ

Nov 9, 2024 - 15:11
 0  17
రూ 2.50 లక్షల విలువైన ఎద్దులు, ఆవుల చోరీ

జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల గుర్తు తెలియని వ్యక్తులు రూ 2.50 లక్షల విలువైన ఆవులు ఎద్దులను చోరీచేసిన సంఘటన గద్వాల మున్సిపాలిటి కేంద్రంలో  శనివారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గద్వాల మున్సిపాలిటి కేంద్రంలోని దౌదర్పల్లి ఏడవ వార్డుకు చెందిన దుబ్బ శేషప్ప కుమారుడు రాజీ అనే రైతుకు సంబంధించిన రూ 2.50 లక్షల విలువ చేసే రెండు ఆవులు,రెండు ఎద్దులు కొండపల్లి రోడ్డు లోని రంగారెడ్డి మిల్లు సమీపంలో కట్టేసి ఉంచాడు. తెల్లవారుజామున ఎవరు లేని సమయంలో ఆ మూగజీవాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. కౌగిలి పండ్లతో జీవనం గడిపే ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333