వికలాంగులకు నూతన పింఛన్ అందే విధంగా చూడాలి హెల్పింగ్ వికలాంగుల సొసైటీ జిల్లా అధ్యక్షుడు రమేష్
గుండాల 26 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల ముందు మెనూ లిస్టులో దివ్యాంగులకు 4వేల పింఛన్ 6వేల చేస్తానని వృద్ధులు ఒంటరి మహిళలకు 2వేల నుంచి 4వేల చేస్తానని హామీ ఇచ్చిన సందర్భంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల నర అవుతుంది ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేరని సందర్భంగా వికలాంగులకు బస్సు ఫ్రీ ఇవ్వాలని అలాగే పెన్షన్ 4వేల నుంచి 6 వేలు ఇవ్వాలని చలో బస్ భవన్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బుధవారం రోజు ఉద్యమం దివ్యాంగులు వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుడు యాదాద్రి భువనగిరి జిల్లా వాసిలో ఇంద్ర పార్క్ సభలో పాల్గొన్నారు.