మాదిగ హక్కుల దండోరా నూతన కమిటీ ఎన్నిక
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. గతంలో ఉన్న పాత కమిటీలు రద్దుచేసి నూతన కమిటీగా ఎన్నుకున్నారు. TMHD వ్యవస్థాప అధ్యక్షులు మర్ముల మాదిగ మల్లేష్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు మొండి కత్తి లింగన్న . రాష్ట్ర అధికార ప్రతినిధి మెట్టుపల్లి కొమురయ్య మాదిగ ప్రెసిడెంట్ గా లద్ద నరసింహులు మాదిగ.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుచనపల్లి రవి మాదిగ. అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేడికొండ సామిల్ మాదిగ . రాష్ట్ర ఉపాధ్యక్షులు బోట్ల రమేష్ మాదిగ. సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అందించే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ రాష్ట్ర కమిటీని బలోపెత్తనం చేయాలని అన్నారు. అన్ని జిల్లాలలో సదస్సు నిర్వహిస్తూ మాదిగ ఉపాకులకు తెలంగాణ రాష్ట్రంలో అందించే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు పరచాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా 10 డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని రాష్ట్ర కమిటీ చేతుల మీదుగా విడుదల చేశారు.