మరణించిన  పోలీసు కుటుంబానికి చెక్ అందజేత:జిల్లా ఎస్పీ టి . శ్రీనివాస రావు

Aug 21, 2024 - 19:46
 0  1
మరణించిన  పోలీసు కుటుంబానికి చెక్ అందజేత:జిల్లా ఎస్పీ టి . శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అనారోగ్యం కారణంగా మరణించిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యురాలుకు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావుకార్పస్ ఫండ్ క్రింద 49,800/- రూపాయాల చెక్ ను, విడో పెన్షన్ క్రింద 10,000/- రూపాయాల చెక్ ను అందజేసారు. ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ ఈ సంవత్సరం జనవరి నెలలో అనారోగ్యం తో  మరణించగా  వారి కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్ క్రింద 49,800/- విడో పెన్షన్ క్రింద  10,000/-  రూపాయల చెక్ ను    జిల్లా  ఎస్పీ అందజేశారు.ఈ సందర్భంగా  జిల్లా ఎస్పీ వారి కుటుంబ స్థితి గతులను, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏ
ఓ ను ఆదేశించారు.ఈ కార్యక్రమములో కార్యాలయ ఏ. ఓ సతీష్ , హెడ్ కానిస్టేబుల్  భార్య రాజేశ్వరి పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333