మతోన్మాద బీజేపీ ని ఓడించాలి ...

MCPIU రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు

Apr 2, 2024 - 22:14
Apr 2, 2024 - 22:14
 0  4
మతోన్మాద బీజేపీ ని ఓడించాలి ...

మతోన్మాద బీజేపీ ని ఓడించాలి అని MCPIU రాష్ర్ట కార్యదర్శి గాదగోని రవి అన్నారు. మంగళ వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో జిల్లా కమిటీ సమావేశం ఏపూరి సోమన్న అధ్యక్షతన జరిగినది.ఈ  సమావేశంలో వారు మాట్లాడుతూ  కమ్యూనిస్టులు బలహీన పడటం మూలాన దేశం ఆర్థికంగా వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాలు బలంగా ఉన్నట్లయితే రైతులకు గిట్టుబాటు ధర, నిరుద్యోగ సమస్య అందరికీ విద్యా, ఉద్యోగం, అందుబాటులో ఉండేవని తెలిపారు ఈరోజున  ఇవన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నాయని ఎర్రజెండా బలహీనంగా ఉండటం మూలాన దేశంలో అసమానతలు ఎస్సీ ,ఎస్టీ మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయని తెలిపారు .ఈ దాడుల పై ఆరోపణలు ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టడం బడా కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ రైతాంగాన్ని ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నారని తెలిపారు.
 ఇప్పుడున్న పరిస్థితుల్లో మతోన్మాద బిజెపిని ఓడించాల్సిన బాధ్యత యువతపై ఉందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓడినట్లయితే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని రైతాంగానికి గిట్టుబాటు ధర దక్కుతుందని ఇది జరగని ఎడల మళ్లీ కార్పొరేట్ శక్తుల చేతులకు పోతుందని తెలిపారు.ఎర్రజెండాలు బలపడవలసిన అవసరం ఉందని ఈ దేశానికి ఎర్రజెండాలు మాత్రమే పరిష్కారం చూపగల సత్తా దమ్ము ఉంటుందని తెలిపారు .రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుండి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎం సి పి ఐ యు అభ్యర్థి కామ్రేడ్ వస్కుల
మట్టయ్య  ని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని దళిత బహుజనలందరూ బలపరిచి గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని
BN ఓంకార్ కలలుగన్న కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలు అభ్యర్థి మట్టయ్యను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ మాట్లాడుతూ పార్టీని ప్రజాసంఘాలను బలోపేతం చేయుట కొరకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే రానున్న ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు
ఈరోజు జరిగిన సమావేశంలో అమరజీవి కామ్రేడ్ లింగంపల్లి రాములు ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి సుదీర్ఘకాలం పనిచేస్తూ అనారోగ్యంతో చనిపోయి నేటికీ ఏడు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా వారి ఏడవ వర్ధంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు 
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి వస్కుల మట్టయ్య మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి కుంభం సుకన్య పార్టీ సీనియర్ సీనియర్ నాయకులు బచ్చుకోటయ్య ఉగ్రయ్య సుధీర్ లింగంపల్లి  రాజు .సంతోష్ నక్క శ్రీనివాస్ వేముల పెద్ద నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333