బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ రాక..!
జోగులంబ గద్వాల 12 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి. శాలువా కప్పి ఘన స్వాగతం పలికిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ మరియు అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్ అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ మండలల పార్టీ అధ్యక్షులు ఆయా గ్రామాల సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపిటిసిలు మాజీ ఎంపీటీసీలు జెడ్పిటిసిలు మాజీ జడ్పిటిసిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరయ్యారు.