బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఘన నివాళులు
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్
మిర్యాలగూడ, 5 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్118వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLCశంకర్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ మన మాజీ ఉప ప్రధాని డా బాబు జగ్జీవన్ రామ్ అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏకైక వ్యక్తి మాత్రమే కాదు
35 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎక్కువ కాలం మంత్రి పదవి చేసిన ఏకైక నాయకుడు కూడా వారే అని అన్నారు. ఆనాటి స్వతంత్ర ఉద్యమం నుంచి వారు నిత్యం బడుగు బలహీన వర్గాల తరుపున పోరాడుతూ ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చారు
అలాగే దాదాపు 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కి తమ సేవలు అందించి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యారు అని అన్నారు
అలాంటి మహనీయుని జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం వారిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెసు నాయకులు, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, చిరుమరి కృష్ణయ్య,బెజం సాయి, సిద్దు నాయక్, నాగవెల్లి మధు, నగేష్, తలకొప్పుల సైదులు, రావు ఎల్లారెడ్డి, పరగి సురేష్, వెంకన్న, మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.