ఫ్లాగ్ డే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్
స్టాల్స్ ను,రక్త దాన శిబిరం ప్రారంభించిన జిల్లా కల్లెక్టర్ శ్రీ బి.ఎం.సంతోష్
జోగులాంబ గద్వాల 21 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ స్టాల్స్ ను, రక్త దాన శిబిరం ను జిల్లా కలెక్టరు బి.ఏం సంతోష్,జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే కె.విజయుడు తో కలిసి ప్రారంభించారు.అందులో భాగంగా ఓపెన్ హౌస్ లో మాదక ద్రవ్యాల నివారణ యూనిట్, భరోసా, షి టీం, సైబర్ క్రైమ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాఫిక్, ఆయుధ ప్రదర్శన, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్టాల్ లను పరిశీలించారు.ఈ సందర్బంగా జిల్లా లో మాదక ద్రవ్యాల నివారణ పోలీస్ వారు తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు వాటి పై చైతన్యం కల్పిస్తున్న తీరును, వాటినీ వినియోగిస్తున్న వారి ప్రవర్తనలో వచ్చే మార్పు ను వివరించారు. లైంగిక వేదింపులకు గురైన బాధిత మహిళలకు భరోసా సిబ్బంది వైద్య, న్యాయ, సైకలాజికల్ సపోర్టు అందిస్తున్న తీరును, ఇప్పటి వరకు బాధిత మహిళలకు పొందిన నష్టపరిహారం, ఉపాధి కల్పన వివరాలు తెలియజేశారు. మహిళ విద్యార్థులను వేదిస్తున్న ఈవ్ టీజింగ్ కు షి టీమ్ చేపడుతున్న చర్యలు, ఇప్పటి వరకు నమోదు చేసిన వివరాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్న అవగహన కార్యక్రమాల వివరాలు ముఖ్య అతిథులకు వివరించారు. అలాగే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు , అత్యాశకు పోయి అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే మొబైల్ లింక్ నొక్కడం ద్వారా బ్యాంకు అకౌంట్ వారికి హ్యాక్ అయి డబ్బులు కోల్పోవడం, ఇప్పటి వరకు ఫ్రిజ్ చేసిన అమౌంట్ వివరాలు, బాధితులకు అందించినా నగదు వివరాలు,పాపిలాన్ డైవిస్ ద్వారా నేరస్తులను గుర్తించడం గురించి ట్రాఫిక్ నియమాలు,సైన్ బోర్డ్స్, ఆయుధాల వినియోగం, అత్యాధునిక టెక్నాలజీ తో తయ్యారు అయిన ఆయుధాల ప్రదర్శనను, డాగ్స్ స్క్వార్డ్, బాంబు దిస్పోజల్ టీం అపనితీసును పరిశీలించారు. అనంతరం గద్వాల్ కేంద్రానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని వీక్షించగా వారికి ఆయా విభాగాల పని తీరును, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, అత్యవసర సమయాలలో ఉపయోగించే డయల్ -100, షి టీం గురించి వివరించారు.
రక్తదాన శిబిరo ప్రారంభం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారం తో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరం ను జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ, ఆలంపూర్ ఎంఎల్ఏ తో కలిసి ప్రారంభించారు.అందులో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ విధినిర్వహణలో అమరులైన పోలీసు వీరులను ఈ సమాజం ఎప్పుడూ గుర్తుకు ఉంచుకుంటుందని తెలిపారు,
వారి యొక్క అడుగుజాడల్లో నడచి వారి యొక్క ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు, ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు, రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందించడం గొప్పతనమని రక్తదానం ప్రాణదానంతో సమానమని
అమ్మ జన్మనిస్తే రక్తదానం పునర్జన్మ నిస్తుందని అన్నారు.ఒక్క రక్తదానంతోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం సాధ్య మవుతుందన్నారు. రక్తదానం చేసిన పోలీస్ అధికారులు సిబ్బంది మరియు వివిధ యువజన సంఘాలు యువకులను జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ రక్తదాన శిబిరంలో మొత్తం 29 యూనిట్ల రక్తం సేకరించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు కు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె.గుణ శేఖర్, డి.ఎస్పి సత్య నారాయణ, సాయుధ దళా డి.ఎస్పి నరేందర్ రావు, కార్యాలయ ఏ ఓ సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ రాజు,ఆలంపూర్, గద్వాల్, శాంతి నగర్ సిఐ లు రవి బాబు, శ్రీనివాస్, టాటా బాబు, ఆర్ ఐ లు వెంకటేష్, హరీఫ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు,రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డా, తేజేశ్వరి, రాకేష్, రామకృష్ణ, ఫిరోజ్, వేంకటేశ్వర రెడ్డి,అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు .