ఫారెస్ట్ రేంజ్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే .

జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఫారెస్ట్ రేంజ్ నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . హాజరయ్యారు. ఫారెస్ట్ రేంజ్ నూతన భవనానికి ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది . అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్ ఆవరణం లోని ఎమ్మెల్యే మొక్కలు నాటడం జరిగింది ....
ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి జి వేణుగోపాల, రమేష్ నాయుడు, సత్యం రెడ్డి మాజీ ఎంపీపీ విజయ్, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్, వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్స్ మురళి నాగిరెడ్డి, దౌలు ,నరహరి గౌడ్, పూడూరు కృష్ణ, శ్రీను, రామకృష్ణ శెట్టి నాయకులు గోవిందు, ధర్మ నాయుడు, పూడూరు శ్యామ్, నాగేంద్ర యాదవ్ ,గంట రమేష్, గాంధీ, mk ప్రవీణ్, ఫారెస్ట్ అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.