ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. ఎంపీడీవో రమాదేవి
జోగులాంబ గద్వాల 24 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండలం పరిధిలోని బుడ్డారెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆవరణ నందు సర్పంచ్ చిట్టెమ్మ ఆధ్వర్యంలో స్పెషల్ గ్రామసభ కార్యక్రమానికి ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ... ఏలినో వర్ష బావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు సాగు పై దృష్టి పెట్టాలని గ్రామంలోని రైతులకు సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. గ్రామ శివారులో నిర్మిస్తున్న మహిళా భవనం పనులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి. ఎపిఓ అనిల్ కుమార్. ఎన్ఆర్జిఎస్ టి ఏ శేఖర్. వ్యవసాయ విస్తీర్ణ అధికారి సురేందర్..సర్పంచ్ చిట్టమ్మ పంచాయత్ కార్యదర్శి గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.